Land Cruiser For Telangana Ministers : తెలంగాణ మంత్రివర్గ సభ్యులకు కొత్త ల్యాండ్క్రూయిజర్లు అందుబాటులోకి రానున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ సదుపాయంతో కూడిన ఈ వాహనాలు సుదీర్ఘకాలం తర్వాత ప్రస్తుతం వినియోగానికి సిద్ధమయ్యాయి. 2023 ఏప్రిల్లోనే అప్పటి బీఆర్ఎస్ మంత్రివర్గం కోసం 22 ల్యాండ్క్రూయిజర్లను గత ప్రభుత్వం కొనుగోలు చేసింది.
వాటికి బుల్లెట్ప్రూఫ్ సదుపాయం కల్పించేందుకు సైతం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వీరపనేనిగూడేనికి తరలించారు. అయితే విదేశాల నుంచి రావాల్సిన బుల్లెట్ప్రూఫ్ సామగ్రి సమయానికి అందుబాటులోకి రాకపోవడం, బడ్జెట్ సమస్యతో వాహనాలు అక్కడే ఉండిపోయాయి. ఇటీవలే ఆ వాహనాలు తెలంగాణకు చేరుకోగా మంత్రులకు అందజేయడంపై నిఘా విభాగం దృష్టి సారించింది.