Google     Gmail     EPDS     Aadhaar       PAN    W.QR Code     PAN Record  

త్వరలో రాష్ట్ర మంత్రులకు ల్యాండ్‌క్రూయిజర్లు !

 


Land Cruiser For Telangana Ministers : తెలంగాణ మంత్రివర్గ సభ్యులకు కొత్త ల్యాండ్‌క్రూయిజర్లు అందుబాటులోకి రానున్నాయి. బుల్లెట్‌ ప్రూఫ్‌ సదుపాయంతో కూడిన ఈ వాహనాలు సుదీర్ఘకాలం తర్వాత ప్రస్తుతం వినియోగానికి సిద్ధమయ్యాయి. 2023 ఏప్రిల్‌లోనే అప్పటి బీఆర్​ఎస్​ మంత్రివర్గం కోసం 22 ల్యాండ్‌క్రూయిజర్లను గత ప్రభుత్వం కొనుగోలు చేసింది.

వాటికి బుల్లెట్‌ప్రూఫ్‌ సదుపాయం కల్పించేందుకు సైతం ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా వీరపనేనిగూడేనికి తరలించారు. అయితే విదేశాల నుంచి రావాల్సిన బుల్లెట్‌ప్రూఫ్‌ సామగ్రి సమయానికి అందుబాటులోకి రాకపోవడం, బడ్జెట్‌ సమస్యతో వాహనాలు అక్కడే ఉండిపోయాయి. ఇటీవలే ఆ వాహనాలు తెలంగాణకు చేరుకోగా మంత్రులకు అందజేయడంపై నిఘా విభాగం దృష్టి సారించింది.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!