ప్రథమ సంవత్సరంలో సత్తా చాటిన విద్యార్థులు ఫస్టియర్ ఫలితాలను పరిశీలిస్తే.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 2,67,331 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, వారిలో 1,84,042 మంది విజయం సాధించారు. దీంతో ప్రథమ సంవత్సరంలో అత్యధికంగా 68.84 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిలైన సబ్జెక్టులను క్లియర్ చేసుకోవడంలో మెజారిటీ విద్యార్థులు సఫలీకృతులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 49.29% పాస్ మరోవైపు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 1,31,128 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 64,639 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ విభాగంలో పాస్ పర్సంటేజీ 49.29 శాతంగా నమోదైంది. డిగ్రీ, ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరడానికి ఈ ద్వితీయ సంవత్సర ఫలితాలు అత్యంత కీలకం కానున్నాయి.
ఫలితాలను సులభంగా తెలుసుకోండిలా.. విద్యార్థులు తమ ఫలితాలను, సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను తెలుసుకోవడానికి ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in లో ప్రత్యేక లింకులను ఏర్పాటు చేశారు. విద్యార్థులు వెబ్సైట్ను సందర్శించి, 'ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్' ఆప్షన్ను ఎంచుకోవాలి. అక్కడ తమ కోర్సు (జనరల్/ఒకేషనల్), సంవత్సరం (ఫస్టియర్/సెకండియర్) వివరాలను సెలెక్ట్ చేసుకుని, హాల్ టికెట్ నంబర్ నమోదు చేయడం ద్వారా మార్కుల మెమోను పొందవచ్చు. ఉన్నత విద్యా ప్రవేశాల దరఖాస్తుల కోసం ఈ డిజిటల్ మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలని అధికారులు సూచించారు.
